టోటల్ గా ముగ్గురూ ఫెయిల్: అంబటి రాంబాబు

  • ప్రజాగళం సభపై వైసీపీ నేతల విమర్శలు
  • మైక్ ఫెయిల్ అన్న అంబటి
  • మీటింగ్ ఫెయిల్ అని ఎద్దేవా
చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ, జనసేనలు ఎంతో ఆశతో పెట్టుకున్న సభ వాళ్లిద్దరికీ ఎంతో నిరాశను మిగిల్చిందని ఎద్దేవా చేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో మైక్ ఆగిపోవడంపై కూడా వాళ్లు సెటైర్లు వేస్తున్నారు. ఎక్స్ వేదికగా అంబటి రాంబాబు స్పందిస్తూ... 'మైక్ ఫెయిల్... మీటింగ్ ఫెయిల్...  టోటల్ గా ముగ్గురూ ఫెయిల్' అంటూ ఎద్దేవా చేశారు.

Ambati Rambabu
YSRCP
Telugudesam
Janasena

More Telugu News